అన్యాయం ఎక్కడ జరిగినా.. ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైకాపా ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్సీ అశోక్బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అశోక్బాబును అన్యాయంగా అరెస్టు చేశారు. మూడేళ్లకే జగన్కు అంత ఉంటే.. 14ఏళ్లు సీఎంగా చేసిన నాకెంత ఉండాలి. తప్పు చేసే ప్రతి అధికారి తప్పించుకోలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం. ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారు. 33 మంది తేదేపా నేతలను హత్య చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా.. పరిష్కారం కోసం అక్కడ తెదేపా ఉంటుంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.