38.2 C
Hyderabad
April 29, 2024 21: 33 PM
Slider ప్రత్యేకం

దాడి ఘటనపై సీబీఐ తో దర్యాప్తు చెయ్యాలి

#chandrababu

పుంగనూరులో తనపై జరిగిన రాళ్లదాడి పై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల సందర్శన కోసం విజయనగరం వచ్చిన ఆయన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు బంగ్లాలో మీడియా తో మాట్లాడారు. తన పై దాడి చేసిన వారిపైనా, ప్రాజెక్టులు పరిశీలనను అడ్డుకోవాలని చూసే వాళ్లపైనా కేసులు పెట్టకుండా… తన పై కేసు పెట్టడం దేనికి నిదర్శనం అని చంద్రబాబు ప్రశ్నించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్లే కాంట్రాక్టర్లు అయి…సాగునీటి ప్రాజెక్టులను తుంగలోకి తొక్కితే….నిజానిజాలు తెలియజెప్పడానికి తాను వచ్చానని చంద్రబాబు అన్నారు. తనపై దాడి చేయడమేంటని యన ప్రశ్నించారు. తిరిగి తన పై మర్డర్ కేసు…హత్య  కేసు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఈ సంఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్లు కళా వెంకటరావు ,కోండ్రు మురళీ, అశోక్ గజపతిరాజు, సుజయకృష్ఢ ,బేబీ నాయన తదితరులు పాల్గొన్నారు.

Related posts

యాజమాన్యం తప్పిదం వల్లే ఎస్పిఎం పరిశ్రమ దుర్ఘటన

Satyam NEWS

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తుల తనిఖీ

Satyam NEWS

చావ్లా గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీం తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అప్పీలు

Bhavani

Leave a Comment