33.7 C
Hyderabad
April 29, 2024 01: 05 AM
Slider అనంతపురం

కళ్యాణ దుర్గం లో పసిపాప మృతి పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

#chandrababu

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్విట్ చేశారు. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారని ఆయన అన్నారు.

ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు? చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి… ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు.

Related posts

(NEW) What Is The Best Medication To Lower Diastolic Blood Pressure Potassium Supplementation Lowers Blood Pressure Does Rogaine Lower Your Blood Pressure

Bhavani

ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం పెంచాలి

Satyam NEWS

పవనిజం: బట్టబయలైన ఏపీ బీజేపీ విభేదాలు

Satyam NEWS

Leave a Comment