28.7 C
Hyderabad
April 28, 2024 05: 13 AM
Slider కర్నూలు

శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాలలో మార్పులు

#srisailam temple

శ్రీశైలంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే గర్భాలయ ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తూ ఉండగా , వివిధ ప్రాంతాల భక్తుల అభ్యర్థన మేరకు సాయంకాలం కూడా ఉచిత స్పర్శదర్శనం కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుమతించగా గురువారం మాత్రం ఆలయ శుద్ధి చేసుకునేందుకు వీలుగా 01.30 గంటల నుంచి 02.30 వరకు గర్భాలయ ప్రవేశం ప్రవేశం కల్పించి తిరిగి సాయంకాలం  06.30 నుంచి 07.30 వరకు సామాన్యుల భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.  ఈ సమయంలో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికి మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భాలయం ప్రవేశించే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని ఆయన కోరారు.

Related posts

గోడదూకిన డొక్కా ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ

Satyam NEWS

వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ

Sub Editor

కలిశాను…. కానీ టీ తాగలేదు

Satyam NEWS

Leave a Comment