ఛత్రపతి శివాజీ 390 జయంతి కార్యక్రమం వేములవాడలో ఘనంగా నిర్వహించారు. వేముల వాడలోని మూడవ వార్డు అయ్యోరిపల్లిలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పలువురు పూల మాల వేసి నివాళి అర్పించారు. మూడవ వార్డ్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ నేతృత్వం లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు వడిజె మల్లయ్య, వంగల రాజమల్లయ్య, ఉళ్లేందుల అంజయ్య, అరె సంఘం అధ్యక్షుడు వడిజె తిరుపతి నాయకులు కాతుబండ లింగయ్య, ఎన్ద్రియాల పిరయ్య, లింగంపల్లి శేఖర్, రాములు, ప్రశాంత్ పెద్దలు యువకులు పాల్గొన్నారు.