డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకట్ట..!
తెలంగాణ రాష్ట్రం లో మరో సారి కెసిఆర్ సర్కార్.. రజాకార్ల ను తలపించే విధంగా వ్యవహరించింది. హైదరాబాద్ లో బాటా సింగారం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూంల పరిశీలనకు వెళ్లి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని పోలీసులు బలవంతంగా జీపు లో ఎక్కించిన ఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి డ్రైవర్ ను తొలగించి… పోలీసు అధికారి స్వయంగా డ్రైవ్ చేసి…కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రశ్నించారు.
ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగుబాటా? కేవలం ఇండ్లు చూడడానికి వెళ్తుంటే భయమెందుకని ప్రశ్నించారు. ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది. బీఆరెస్ ను గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. హౌస్ అరెస్ట్ లు అక్రమ అరెస్టులు బీఆరెస్ ప్రభుత్వ నిరంకుశత్వనికి పరాకాష్ట అని ఆరోపించారు. గొప్పగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులెందుకు అని ప్రశ్నించారు. బాటసింగరం లో బీఆరెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను చూసేందుకు పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఖండించారు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేయడం గృహానిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. 2ఏళ్ళల్లో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్ 9 ఏళ్ళైన పేదల డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం మాత్రం జరగలేదంటే పేదలపట్ల బీఆరెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుందని పేర్కొన్నారు… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.