మంత్ర మల్లా రెడ్డి ఇంట్లో గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న ఈ తరుణంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కష్టపడి సంపాదించి నిజాయితీగా మెలిగానన్నారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను. బీజేపీ అక్రమంగా దాడులు చేయిస్తోంది. దాడులకు బెదిరేది లేదు. నా కుమారుడు ఆస్పత్రిలో చేరాడు. సీఆర్పీఎఫ్ దళాలతో రాత్రంతా కొట్టించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.