30.7 C
Hyderabad
April 29, 2024 03: 50 AM
Slider వరంగల్

ఆపద కాలంలో అండగా నిలిచిన బాల్య మిత్రులు

#mulugu friends

ఆపద కాలంలో అండగా నిలిచిన బాల్య మిత్రులు ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. బంధువులు, తోడబుట్టిన వారూ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో స్నేహితులే ఆదుకుంటారు.

అందులో డౌటే లేదు……

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి బాల్యమిత్రులు ఇదే విషయాన్ని తాజాగా రుజువు చేశారు.

పసర  జిల్లా పరిషత్ పాఠశాలలో 2001 పదవ తరగతి బ్యాచ్ లో తమ సాటి మిత్రుడు భరత్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.

మానస అనే మిత్రురాలు తండ్రి  కూడా మరణించారు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులు ఇరువురి కుటుంబాలకు తమ వంతు సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి  8 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి వారి మానవత్వాన్ని చాటుకున్నారు.

చిన్ననాటి స్నేహితుల కుటుంబాల్లో ఇబ్బందులున్నా అందరం కలిసికట్టుగా తోచిన రీతిలో సహాయం చేయడానికి ముందుంటామని వారు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, ఉపేందర్, క్రాంతి  రమేష్ సురేష్ రాంబాబు, తిరుపతి, కృష్ణ రబ్బానీ పాషా తదితర బాల్య మిత్రులు పాల్గొన్నారు.

Related posts

బడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS

ఉండనీకి ఇల్లు లేదు కుండలోకి మెతుకు లేదు

Satyam NEWS

సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించిన మనో

Satyam NEWS

Leave a Comment