ఈ చెత్త చైనా గాళ్లు మన సైనికులను చంపిన తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడచక మానదు. తుపాకులు ఫిరంగులు వాడకుండా చివరన మేకులు కొట్టి ఉన్న కర్రలను ఉపయోగించి భారత వీర జవాన్లపై దొంగచాటుగా దాడి చేశారు. రాత్రి వేళల్లో భారత సైనికులు అప్రమత్తంగా లేని సమయంలో జరిగిన ఈ దాడిలో కనీసం 20 మంది భారతీయ వీర జవాన్లు మరణించి ఉంటారని తాజా సమాచారం.
అత్యంత కిరాతకంగా మేకులు గుచ్చిన కర్రలు ఉపయోగించి గాల్వాన్ లోయ ప్రాంతంలో చైనా ముష్కరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక వైపు చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మరో వైపు భౌతిక దాడులు చేయడం ఈ సిగ్గులేని చైనా వాళ్లకే చెల్లింది. అత్యంత కిరాతకంగా భారత సైనికులను చంపినట్లు రిపోర్టులు వస్తుండటంతో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. నిన్న అర్ధరాత్రి చైనా కిరాతకులు ఈ దాడులు ప్రారంభించారు.
తెల్లవారే వరకూ చీకటిలోనే ఆ చెత్తగాళ్లు భారత సైనికులను భౌతికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. అత్యంత ఇరుకుగా ఉండే గాల్వాన్ లోయలో పడిపోయి ఎక్కువ మంది భారతీయ సైనికులు మరణించారు. 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖాల పై నుంచి మేకులు గుచ్చిన కర్రలతో కొట్టడంతో ఎంతో మంది నదిలో పడిపోయి మరణించారని సమాచారం. నదిలో పడిపోవడంతో శరీరం గడ్డ కట్టి కొందరు, మేకులు గుర్చిన కర్రలతో దాడులు చేయడం వల్ల గాయాలకు మరి కొందరు మరణించారు.