టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అధికారిక నివాసం టిబెట్లోని పోటాలా ప్యాలెస్ సోమవారం నుండి మూసివేయబడుతుందని అధికారురులు తెలిపారు.చైనాలో ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాలస్ మూసివుంటుందని అధికారులు ఆదివారం చెప్పారు.
టిబెట్ కె తలమానికంగా ,ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా , పురాతన శిల్పసౌందర్యంతో శోభిల్లుతూ 100,000 సాంస్కృతిక అవశేషాలకు నిలయంగా ,1961 నిండే కీలకమైన జాతీయ సాంస్కృతికవారధి గా భాసిల్లుతున్న పొటాలా ప్యాలెస్ ను చూడటానికి ప్రజలు విచ్చేస్తుండటం తో వారికి వైరస్ వ్యాపించి కుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అలాగే వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యటనల టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయాలని చైనా అన్ని ట్రావెల్ ఏజెన్సీలను ఆదేశించింది.