33.7 C
Hyderabad
April 29, 2024 01: 46 AM
Slider నల్గొండ

కార్మికుల కోసం సిఐటియు చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి

#citu

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఈనెల 29వ, తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతుందని,ఈ సభను జయప్రదం చేయాలని,కార్మికులు పోరాటం చేసి హక్కులను సాధించుకున్న ప్రాధాన్యత కలిగిన మే డే ను జయప్రదం చేయాలని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిఐటియు అనుబంధ సంఘాలు,మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమావేశంలో మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట వద్ద పేదల కొరకు నిర్మించిన సుమారు నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కొన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల హక్కుల కొరకై సిఐటియు నాయకత్వాన చేసే పోరాటంలో కార్మికులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు,సిబ్బంది, దుర్గారావు,గోపి,వీరబాబు,కాశీ రావు, సైదులు,దేవకర్ణ,కుమారి,సంతోషం, చంద్రకళ,ఎల్లమ్మ,ముత్తమ్మ,పద్మ,రమణ  పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు .. బీజేపీపై ఆప్ ఎంపీ గరం

Sub Editor

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు

Bhavani

ఉత్తరప్రదేశ్ లో మదర్సాల ఆదాయ వనరులపై సర్వే

Satyam NEWS

Leave a Comment