ఒంటిమిట్ట కోదండ రామాలయం, తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాల పై రాజంపేట శాసన సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. ఎస్. జవహర్ రెడ్డి తో చర్చలు జరిపారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని తెలిపారు. మొట్టమొదటిసారిగా స్వామి వారికి ఆయన ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
ఒంటిమిట్ట చెరువు నందు జాంబవంతుని విగ్రహాన్ని నిర్మించి ఒక పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి పరిసర ప్రాంతాలను, స్వామి వారి మందిరమును, అభివృద్ధి చేసి ఈ ఏడాది నిర్వహించు స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కోరారు.
పద పితామహుడు 32 వేల కీర్తనలు రచించిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించాలని, శ్రీ అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన కోరారు.