ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
కరోనా లాక్ డౌన్ పొడిగించే అంశంపై కొద్ది రోజుల కిందట అమిత్ షా ఫోన్ చేసి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ ఢిల్లీ టూర్ ఖరారు కావడం విశేషం.