కడప జిల్లా ఇడుపులపాయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రి కి ఇడుపులపాయ లోని అతిధి వసతి గృహం లో ఆయన బస చేస్తారు. రేపు ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల తో కలసి నివాళులర్పిస్తారు.
అనంతరం ట్రిబుల్ ఐటీ లో వైఎస్ ఆర్ విగ్రహావిష్కరణ తో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం తిరిగి విజయవాడ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు.