33.7 C
Hyderabad
April 29, 2024 01: 25 AM
Slider నిజామాబాద్

కురుమ, యాదవులను దగా చేస్తున్న కేసీఆర్

#shabbirali

గొర్ల పంపిణీ పేరుతో సీఎం కేసీఆర్ కురుమలను దగా చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం పరిధిపేట గ్రామంలో శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కెసిఆర్ అందరిని దగా చేస్తున్నాడని, కురుమలు, యాదవులను గొర్రెల పంపిణీ పథకం పేరుపై దగా చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల సమయంలో పంచడానికి ఇబ్బంది అవుతుందని యూనిట్ పైసలు మొత్తం వారి ఖాతాలో వేస్తానని ఓట్లు దండుకున్నాడని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు గొర్లు పంపిణీ చేస్తానని కాలయాపన చేస్తున్నాడని, ఇప్పటికే వందల సంఖ్యలో యాదవులు డీడీలు తీసి వేచి చూస్తున్నారన్నారు.

కెసిఆర్ అమాయకుల బలహీనతతో ఆడుకుంటున్నాడని, వచ్చే ఎన్నికల్లో అతనికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ధరణి పోర్టల్ రద్దయ్యేలా రైతన్నల భూ సమస్యలు పరిష్కారమయ్యేలా కాంగ్రెస్ పార్టీ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతుందని, రైతన్నల వెంట కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. కేసీఆర్‌ అహంకారాన్ని అణచి వేస్తూ రాజీలేని పోరు చేయడానికి అండగా నిలబడేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. పోడు పట్టాలిస్తానని అబద్ధాలతో అడవి బిడ్డలను మభ్య పెడుతున్న కేసీఆర్‌కి తగిన బుద్ధి చెబుదామన్నారు.

రైతులకు, గిరిజనులకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పోడు భూములకు పట్టాలిస్తుందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఈ కచరా కేసీఆర్ తన మంత్రులతో కలిసి రాష్ట్రానంతా దోచుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉప ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, భీంరెడ్డి, ఐరేని సందీప్, గోనె శీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సుస్థిర అభివృద్ధి సాధనకు మనసు పెట్టి పని చేయాలి…!

Satyam NEWS

వారంలో రెండు రోజులు కోవిడ్ టీకాల కార్యక్రమం నిలిపివేత

Satyam NEWS

వెంకటగిరి పెన్సిల్ చిత్రకళాకారుడు పొలిశెట్టి శంకర్ కు మరో పురస్కారం

Satyam NEWS

Leave a Comment