40.2 C
Hyderabad
April 26, 2024 13: 19 PM
Slider విజయనగరం

పార్టీ సమావేశంలో విజయనగరం మేయర్ కు అవమానం

#mayor

విజయనగరం మేయర్ విజయలక్ష్మికి ఘోర అవమానం జరిగింది. నగర ప్రధమ పౌరురాలికి సొంత పార్టీలోనే అవమానం జరిగింది. విజయనగరం జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆతిధ్యం వహించింది… విజయనగరం.

ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ,టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో విజయనగరం పూల్ భాగ్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, నగర మేయర్ విజయలక్ష్మి లు నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం రాజన్న దొరలతో పాటు పార్టీ ఎమ్మెల్యే లు…అలాగే పార్టీ అధ్యక్షుడు జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షత న పార్టీ సమావేశం జరిగింది.

మొదట్లో కెమెరా లకు ఎదురు గుండా సభావేదికపై మధ్యలో కూర్చున్న మేయర్… ఒక్కొక్కొరూ రావడంతో వాళ్లనందరినీ వేదిక పై కూర్చోమని చెప్పడంతో… మధ్యలో కూర్చున్న మేయర్.. సభా చివరకు జరిగిపోవడం కనిపించింది. ఉత్తరాంధ్ర లో పార్టీ పటిష్ట తకు 2024లో గెలుపు నకు..వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్..8 మంది పరిశీలకులను నియమించారని…ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు.

పార్టీ బాగుపడాలన్నా…రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనించాలన్న…కార్యకర్తే ముఖ్యమైని విజయనగరం లో జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.

Related posts

తన తండ్రి పుట్టిన నగరంలో కొడుకు కు జ్ఞాన సరస్వతి అవార్డు…

Satyam NEWS

అతి పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వకీల్ సాబ్ అభిమానగణం

Satyam NEWS

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం బాసర లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment