నెల్లూరు టౌన్ హాల్ లో ఆదివారం నాడు శాంతి కల్చరల్స్ సంస్థ 21 వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లా లో వివిధ కళారంగాలలో విశిష్ట సేవలందిస్తున్న కళాకారులను సత్కరించారు. అందులో భాగంగా “పెన్సిల్ ఆర్ట్” లో వెంకటగిరి పట్టణం,శివాలయం వీదికి కి చెందిన పొలిశెట్టి శంకర్ @ ఫ్లెక్స్ శంకర్ ను ఎంపిక చేసి ఆత్మీయ కళా సత్కారం చేశారు. ముఖ్య అతిధి, ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు అమరావతి హోటల్స్ అధినేత అమరావతి కృష్ణా రెడ్డి చేతుల మీదుగా శంకర్ కు సన్మానపత్రం తో పాటు శాలువా కప్పారు. ఈ సందర్బంగా అమరావతి కృష్ణారెడ్డి పెన్సిల్ ఆర్ట్ చిత్రపటాన్ని శంకర్ ఆయనకు బహుకరించారు. అందుకు ఆయన ఎంతో సంతోషపడి శంకర్ ను శాలువాతో సత్కరించి నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గురుప్రసాద్, శాంతి కల్చరల్ సంస్థ నిర్వాహకులు అమీదుల్లా ఖాన్,సినీ గాయకులు, కళాకారులు పాల్గొన్నారు.
కె.రమాకాంత్