38.2 C
Hyderabad
April 28, 2024 19: 42 PM
Slider కడప

జగన్ పాలనలో పెరిగింది హత్యలు, దోపిడిలు, అత్యాచారాలు మాత్రమే

#changalraidu

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు అన్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం వేధింపులకు గురిచేయడం జరుగుతోందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తారీకు  చంద్రబాబు నాయుడు ఇంటి పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అతని వర్గీయులు రాడ్లతో, కర్రలతో  విచక్షణ రహితంగా బూతులు మాట్లాడుతూ దాడి చేశారని ఆయన తెలిపారు. తెదేపా శ్రేణులు సదరు విషయమై నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ప్రయత్నిస్తుంటే నాయకులపై కేసులు పెట్టడం గృహ నిర్భందాలు చేయడం శోచనీయం అన్నారు.

ఈ రాష్ట్రంలో హోంశాఖ అనేది ఒకటి ఉందా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తెదేపా జాతీయ పార్టీ అధ్యక్షులు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన  నారా చంద్రబాబు నాయుడు  ఇంటిపై దాడి చేయడంరాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర పరిపాలన అద్దం పట్టే విధంగా ఉందని ఇకనైనా కేంద్రంచొరవతీసుకొని  రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి  రాష్ట్రంలోని అరాచకాలు అరికట్టాలని అన్ని గ్రామాల నుండి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి గవర్నర్ కుపంపడం జరుగుతుందని తెలియజేశారు. టీడీపీ నేతలు డాక్టర్ సుధాకర్, మందా శ్రీను,సంజీవరాయుడు,అద్దెపల్లె  ప్రతాప్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నరసరావుపేటలో భారీ ఎత్తు రేషన్ బియ్యం స్మగ్లింగ్

Satyam NEWS

మజ్లీస్ మద్దతుతో మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్ధి

Satyam NEWS

ఈ నెల 8 న కామారెడ్డిలో వై ఎస్ షర్మిల పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment