సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల గ్రామం పంచాయతీ కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో సిఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన 4,33,500 రూపాయలను మండలంలోని 12 మంది లబ్ధిదారులకు మేళ్లచెరువు సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి చెక్కులను వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈవో నారాయణరెడ్డి, మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.