ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లోని గల ప్రముఖ బ్యాంకు వద్ద బ్యాంకు వినియోగదారులు సామాజిక దూరాన్ని ఏ కోశానా పాటించడం లేదు.
పలుమార్లు ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు వచ్చి చెప్పినప్పటికీ మళ్లీ అదే తీరు కనబడుతున్నది. ఈరోజు కరోనా దృష్ట్యా అంగడి, మండల కేంద్రం బంద్ ఉన్నప్పటికీ బ్యాంకు వద్ద మాత్రం ఏ ఒక్కరూ సామాజిక దూరం పాటించక పోవడంతో స్థానిక యస్.ఐ.రోహిణి బ్యాంకు అధికారులతో మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ కరోనా నేపథ్యంలో మాస్క్ లు,సామాజిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై కూడా ఉందని నిబంధనలు పాటించకపోతే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.