Slider అనంతపురం

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

RayadurgamPoliceNew

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని శుక్రవారం నాడు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం ఏఎస్పీ రామ్మోహన్ రావ్ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పట్టణ శివారు ప్రాంతమైన గాలి మారమ్మ గుడి దేవాలయం సమీపంలో ఏర్పాటుచేసిన చెక్ పోస్టు వద్ద అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న  నిందితులతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

రాయదుర్గం పట్టణ అర్బన్ సిఐ తులసీరామ్ ఆధ్వర్యంలో ఎస్సై రాఘవేంద్రప్ప పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక ప్రాంతమైన మొలకల్మూరు నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వారి నుండి 37 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాదాపు వాటి విలువ రూ.3.23    లక్షలు వుంటుందని తెలిపారు. 

అదేవిధంగా అక్రమంగా మద్యం తరలిస్తున్న బోయ శ్రీకాంత్, నాయకుల ఆంజనేయులు, శివ కుమార్, కురుబ  గంగాధర్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Related posts

బీజేపికి మెజారిటీ రాకపోయి ఉంటే బాగుండేది

Satyam NEWS

Un Lock 3.0: సినిమా ధియేటర్లకు పర్మిషన్ నో

Satyam NEWS

ఇటుక బట్టి యజమాని కిడ్నాప్ కేసును ఛేదిస్తాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!