కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందచేశారు.
ఆరోగ్య ఖర్చుల నిమిత్తం కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి CMRF నుండి వీటిని మంజూరు చేయించారు. సహాయం అందుకున్న వారిలో మీదిగేరి లక్ష్మీకి 40 వేల రూపాయలు, మాస్టర్ కౌశిక్ కు 14 వేల రూపాయలు ప్రభుత్వం నుండి అందాయి.
ఈ రోజు గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు చెక్కులను సర్పంచ్ మండ్ల కృష్ణయ్య, సింగిల్ విండో చెర్మెన్ చింతకుంట శ్రీనివాసులు, ఉపసర్పంచ్ చించెట్టి సత్యనారాయణ చెక్కులను అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో వార్డ్ నెంబర్లు కురుమూర్తి, బాలపీర్, నాయకులు నరసింహ గౌడ్, మోహనా చారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.