శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన సూక్ష్మ స్వర్ణకారుడు ముగడ జగదీశ్వరరావును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. గత కొన్నేళ్లుగా సుద్దముక్కలు, పెన్సిల్ మొన, వెండి కాయిన్ పై విభిన్నఆకృతులు తయారు చేస్తూ బ్రావో ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ చిత్రాన్నివెండి కాయిన్ పై వేసి అద్భుత ప్రతిభ చాటుకున్నారు. 180 రూపాయల విలువైన 2. 6 మిల్లి గ్రామాల వెండితో ఈ కళా ఖండాన్నిరూపొందించి కోవిడ్ సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను కలెక్టర్ కు బహుకరించారు.
ఈ సందర్భంగా జగదీష్ ను కలెక్టర్ సత్కరించి భవిష్యత్ లో జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మీడియా జేఏసీ ప్రతినిధులు శాశపు జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాల్, ఎం.ఏ.వి.సత్యనారాయణ, తంగి హేమసుందర రాజు తదితరులు పాల్గొన్నారు.