కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని అసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు.
కళాశాలల్లో నిర్వహిస్తున్న తరగతుల్లో హాజరు, సానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
కళాశాలకు వచ్చిన విద్యార్థులకు ముందుగా థర్మల్ స్క్రీనర్ ద్వారా టెంపరేచర్ టెస్ట్ చేస్తూ, తల్లిదండ్రులు ఇచ్చిన అనుమతి పత్రాలను పరిశీలించాలని ఆ తర్వాతనే వారిని అనుమతిస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మాస్కులు ధరించని వారిని లోనికి అనుమతించరాదని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్, కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ జూఫిషా ఖానం, అధ్యాపకులు తెలిపారు.