74వ గణతంత్ర దినోత్సవ వేళ…స్వాతంత్ర్య సిద్ధికై ప్రాణాలు పణంగి పెట్టిన ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే..ఈ స్వేచ్ఛా ప్రపంచంలో ఉండగలుగుతున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. ఈ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా విజయనగరం పరేడ్ మైదానంలో… జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్య కుమారి తన ప్రసంగం లో గురజాడ, మోక్షగుండ విశ్వేశ్వరయ్య ,జిడ్డు కృష్ణ మూర్తి, వంటి త్యాగధనులను గుర్తు చేశారు.
వారి అడుగు జాడలలో మనమంతా పయనించాలన్నారు.ఈ సందర్భంగా నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలలో ముందు గా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ .. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.. జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. ఎం.దీపిక, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నగర మేయర్
వి.విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిపై శకటాల ప్రదర్శన, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు.