ఏపీ రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అధికార పీఠం కోసం ఊవ్విళ్లూరుతున్న జనసేన పార్టీ లు…మోడీ ప్రభుత్వ కనుసన్నల్లో పని చేస్తున్నాయన సీపీఎం తీవ్రంగా ఆరోపించింది. మోడీ తాలూక ఫాపిస్ట్ విధానాలను తిప్పికొట్టాలంటూ ఈ నెల 14 నుంచీ ఆ పార్టీ నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఆ పార్టీ రణభేరి పేరు తో సభ నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శంకరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ సర్కార్.. కేంద్రంలో మోడీ సర్కార్ మూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అథోగతి పాలయ్యాయన్నారు.ప్రతీ ధర ఆకాశాన్నంటి..ప్రజలందరూ నష్టాలతో పాటు అప్పులతో కుటుంబ జీవనం సాగిస్తూన్నారని విమర్శించారు. అటు కేంద్రం లో బీజేపీ ఇటు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధ్వాన్నంగా పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. గత టీడీపీ పాలన కన్నా ఏ మాత్రం తీసిపోకుండా.. రెట్టింపు ధరలను పెంచిన ఈ రెండు ప్రభుత్వాలను ఇంటికి పంపించేందుకే ఈ పోరాటమి రెడ్డి శంకరరావు హెచ్చరించారు.
previous post