28.7 C
Hyderabad
April 28, 2024 09: 20 AM
Slider తూర్పుగోదావరి

ఏ మాత్రం ఆత్మాభిమానం లేని లక్ష్మీపార్వతి

#kosurichendipriya

తన భర్త పేరును తొలగించినా ఆత్మాభిమానం చంపేసుకున్న లక్ష్మీ పార్వతి కనీసం సమాజంకోసమైనా తెలుగు అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాజమండ్రి తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడుపై నిత్యం అక్కసు వెళ్ళబోయడం మాత్రమే తప్ప, ఎన్ టి ఆర్ ఆరాధ్య దైవం అని పదే పదే చెప్పుకునే అర్ధాంగిగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్ టి ఆర్ పేరు తొలగించినా నిస్సిగ్గుగా పదవిలో కొనసాగడం హేయమైనదని ఆమె గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎన్.టి.ఆర్. జివిత చరిత్ర వ్రాసేందుకు ఆయన పంచన చేరిన‌ లక్ష్మీపార్వతి, ఎన్.టి.ఆర్. జీవితంలోకే చొరబడి, ఇప్పుడు ఆయన ఆత్మకి అవమానం‌ జరిగినా నోరు మెదపకపోవడంతో, ఎన్.టి.ఆర్. ఆత్మ క్షోభకు కారణం అవుతున్నారని చండీప్రియ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆస్తుల వివరంపై సుప్రీంకోర్టు ఎక్కి చివాట్లు తిన్న షాక్ నుంచీ త్వరగా కోలుకుని, తెలుగు అకాడమీకి రాజీనామా చేయాలని చండీప్రియ కోరారు.

Related posts

‘రిజర్వు’ నిధులతో ఏం చేస్తారో?

Satyam NEWS

రేపటి నుంచి గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం

Satyam NEWS

భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment