కరోనా కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం పెద్ద ఎత్తున సీపీఎం సీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.
కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలని, 200 రోజులు ఉపాధి కల్పించాలని ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువులు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని తదితర డిమాండ్లతో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ,జిల్లా నేతలు మహేష్,చిట్వేల్ రవి, నరసింహ సర్వేపల్లి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ సి.సి.కి నిరసన కారులు వినతిపత్రాన్ని అందజేశారు.