ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామ వైసీపీ సర్పంచ్ భర్త రంగు గాంధీ తనను వేధిస్తున్నాడని మహిళా వలంటీర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కోరిక తీర్చలేదని వారం క్రితం ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనకు తన భర్తకు స్వల్ప మనస్పర్థలు వచ్చాయని, తన భర్త తమ గొడవను పరిష్కరించమని అతని వద్దకు వెళ్లడంతో అతను వివాదం పరిష్కరించకుండా, తన ఫోన్ లాక్కొని, తనను కులం పేరుతో దూషిస్తున్నాడని తెలిపింది.
సర్పంచ్ భర్త నుంచి తనను కాపాడాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.