నిరుపేదల ఆకలి తీర్చడం భగవంతుని సేవ కన్నాగొప్పదని స్వామి వివేకానంద అవార్డు గ్రహీత గురుగుబెల్లి లోకనాథం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆదివారం పేట వద్ద ఉన్న గురు రాఘవేంద్ర స్వామి ఆలయ ఆవరణలో ధర్మకర్త బరాటం కామేశ్వరరావు పర్యవేక్షణలో నిత్య అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన అన్నదాన కార్యక్రమం గులోనా చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కార్తీక మాసంతో పాటు మిగిలిన రోజుల్లో కూడా పేదలకు అన్నదానం నిర్వహిస్తూ గొప్ప సేవా కార్యక్రమం రాఘవేంద్ర స్వామి ఆలయ ట్రస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నదానం ఎంతో పుణ్యాన్నిమరింత సంతృప్తిని కలిగిస్తుందని గులోనా చెప్పారు. నిరంతర సేవా కార్యక్రమాలతో బరాటం కామేశ్వరరావు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేణుగోపాల స్వామి, ట్రస్ట్ సభ్యులు గుప్త తదితరులు ఉన్నారు.