కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన కంపోస్టు షెడ్డును జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగతిన నిర్మాణం పూర్తి కావడం పట్ల స్థానిక సర్పంచ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, మాజీ జడ్పిటిసి సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు పాల్గొన్నారు.
ఇంకా, నాయకులు నూకల రాజు, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, ఉపసర్పంచ్ నాగరాజు పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్రెడ్డి ,పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్థానిక ఎంపీటీసీలు ఉన్నారు.