విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రాజకుమారిని ద్రోణ కన్సల్టెన్సీ సీఈఓ సురేష్ బేతా జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి, సాలూవాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ బేతా మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లా లోని శాంతిభద్రతలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోన్నారన్నారు. కరోనా నియంత్రణకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారన్నారు.కరోనా సమయంలో వలసదారులకు, నిరాశ్రయులకు జిల్లా ఎస్పీ రాజకుమారి చేసిన సేవలు ఎనలేనివన్నారు.
పంచాయితీ మరియు మున్సిపాలిటీ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించడంలో విజయం సాధించారని కొనియాడారు. కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో మమేకమవుతూ, జిల్లా ప్రజలకు చేరువయ్యారని సురేష్ బేతా అభినందించారు.