28.7 C
Hyderabad
April 28, 2024 07: 25 AM
Slider మహబూబ్ నగర్

వజ్రోత్సవం నిర్వహించే హక్కు కాంగ్రెస్ కు మాత్రమే ఉంది

#blockcongress

వజ్రోత్సవం వేడుకలు నిర్వహించే హక్కు కాంగ్రెస్ కు మాత్రమే ఉందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం జాతీయ సమైక్యత వారోత్సవాలు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాయితి విజయకుమార్ రెడ్డి తెలంగాణ తల్లి కష్టజీవి అని ఊరి సంస్కృతికి ప్రతిరూపం అన్నారు. మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదని ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదన్నారు.పెత్తందార్ల పై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్ల పై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలని తెలిపారు.

సకల జన తెలంగాణకు, సబ్బండ వర్గాల జనులకు తమ తల్లిని స్ఫురించే రూపం తెలంగాణ తల్లి స్థానానికి అర్హురాలవుతుందని అంతే తప్ప దొరల గడీలలోని దొరసాని రూపమో, రాచరికపు లక్షణాలు కలిగి ఉన్న మహారాణి రూపంమో మన తల్లి  కాదన్నారు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తెలంగాణ సబ్బండ వర్గాల ఆమోదయోగ్యమైన “తెలంగాణ తల్లి” ని  ఆవిష్కరిస్తోందని తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించ పోయేది కాంగ్రెస్ పార్టీ అని మన రాష్ట్రం, మన తల్లి, మన గేయం, మనగానం, మనజెండా, మన ఎజెండా, మన రాష్ట్ర ఆంగ్ల సంక్షిప్త రూపం ఇలా సర్వం సకలజన ఆమోదయోగ్యంగా నిజమైన తెలంగాణ సాంస్కృతికి వారసత్వాన్ని పున:ప్రతిష్ఠకు సంకల్పం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు.తెలంగాణ సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతి పట్నం, ప్రతి తండా, ప్రతి గూడెం ఊరు వాడ ఏడాది పాటు మన వారసత్వ ఘనతను చాటుదామని పిలుపునిచ్చారు.

Related posts

ఉప శాఖల పంచాయితీ: ప్రజా ధనం వృధా

Bhavani

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

Satyam NEWS

షాద్ నగర్ లో బీజేపీ సీనియర్ నాయకుల సమ్మేళనం

Satyam NEWS

Leave a Comment