కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం అగ్రారం తండాలో హాత్ సే హాట్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ స్థానిక నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు యువకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గారి సందేశాన్ని ప్రభుత్వ వైఫల్యాలను మన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఎండగట్టాలన్నారు. రాబోయే రెండు నెలల పాటు ఈ కార్యక్రమంలో నాయకులు అందరూ చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అగ్రారం తండా వాసుల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
previous post