సర్పంచుల విధులపై సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపడతామని టీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ నగరం వెళ్ళటానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నేతలను వెళ్ళకుండా హుజూర్ నగర్ లో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ప్రభుత్వ పోలీసు వైఖరి నశించాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న మొండి వైఖరి సరైనది కాదని,ముందస్తు అరెస్టులతో ప్రభుత్వం ఉద్యమాలను ఆపలేదని అరెస్టు అయినవారు అన్నారు.
అరెస్టు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ 11వ,వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,హుజూర్ నగర్ ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి,హుజూర్ నగర్ నియోజకవర్గ యూత్ ప్రచార కార్యదర్శి కస్తాల రవీందర్, హుజూర్ నగర్ పట్టణ పార్టీ యూత్ అధ్యక్షుడు రాము,పట్టణ మాజీ యూత్ అధ్యక్షుడు కోళ్లపూడి యోహాన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కస్తాల ముత్తయ్య, కందుకూరి రాము తదితరులు ఉన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్