వనపర్తి జిల్లా పానుగల్ మండలం అన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహ నాయుడు కుమారుడు అర్గిటి వెంకటేష్ నాయుడు ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్గిటి వెంకటేష్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
అదే విధంగా అన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దాసరి నరసింహ వారం రోజుల క్రితం పరమపదించారు. నేడు వారి కుటుంబాన్ని కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పరామర్శించి వారికి దైర్యం చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి తిరుపతమ్మ, జిల్లా నాయకురాలు బండి సరోజమ్మ, కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు, బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణయ్య, పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, జిల్లా సెక్రటరీ క్రిష్ణ, తాలూకా యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వహీద్, మండల ఉపాధ్యక్షులు కురుమూర్తి, రంజిత్, జమ్మాపూర్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండల్, స్వామి, శ్రీను, రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, బీరయ్య, గంగ తదితరులు పాల్గొన్నారు.