ఇంత వరకు రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు ఉన్న ఆంధ్ర, తెలంగాణ అనే అడ్డుకట్ట ఇప్పుడు హిజ్రాలలో కూడా మొదలైంది. లాక్ డౌన్ సమయంలో పేదవారికి సహాయం చేయడంలో పాల్గొనప్పుడు హిజ్రాలు కాదు వజ్రాలు అని అందరూ పొగిడారు. అలాంటి హిజ్రాలలో ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ డివిజన్ వచ్చింది. తెలంగాణ ,ఆంధ్రా హిజ్రాలు ఒకరిని ఒకరు నిందించుకుంటూ పోలీస్ స్టేషన్ కు చేరారు.
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ హిజ్రాలు ఆంధ్రాకి వెళ్లితే కొడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఆంధ్రాలోకి వెళితే తెలంగాణ హిజ్రాలు ఇక్కడి కెందుకు వచ్చారు అని కొడుతున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు కూడా అక్కడి హిజ్రాలకే వత్తాసుపలుకుతున్నారని వారు అన్నారు.