సుప్రీంకోర్టు పై ఆర్.ఎస్.ఎస్ పత్రిక చేసిన వ్యాఖ్యలు వాంఛనీయం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ మూల స్తంబాలలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైంది.
సుప్రీంకోర్టు అనేది ప్రజలకు ఒక పెద్ద దిక్కు. కేవలం బీబీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వమన్నందుకు ఆర్.ఎస్ ఎస్ తన పత్రిక పంచజన్యలో సుప్రీంకోర్టు ను తప్పు పడుతూ దేశ వ్యతిరేక శక్తుల పనిముట్టుగా ఉందని వ్యాక్యాలు చేయడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఆర్ ఎస్.ఎస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.