రాబోయే GHMC ఎన్నికలలో సమన్వయంతో పనిచేసి మెజార్టీ డివిజన్ లు గెలిచేటట్టు పనిచేయాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లాలోని గాజులరామారం కూన సౌజన్య గార్డెన్స్ లో నేడు గాజులరామారం బ్లాక్ కమిటీలు, డివిజన్ నియామకాలు జరిగాయి. వాటి పత్రాలను అందజేసిన ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన బ్లాక్, డివిజన్ కమిటీలకు ఎంపికైన సభ్యులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.
టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రజలను పట్టించుకున్న పరిస్థితి లేదని, పేద ప్రజల పై అనేక భారాలను మోపిందని ఆయన అన్నారు.
ప్రజలు పడ్డ ఇబ్బందుల కు బదులుగా త్వరలో ఓట్ల రూపంలో టిఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తారని కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. కొత్తగా ఎంపికైన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
గాజులరామారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చౌదరి గారి బుచ్చి రెడ్డి, డివిజన్ అధ్యక్షులు యామ్ సాగర్ సమక్షంలో బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా నరేందర్ రెడ్డి, సెక్రటరీగా రాంనర్సయ్య, మధుసూదన్
వర్కింగ్ ప్రెసిడెంట్ గా, గాజుల రామారం డివిజన్ కాంగ్రెస్ సంబంధించి తౌసీఫ్ జనరల్ సెక్రటరీ, రాజారెడ్డి వైస్ ప్రెసిడెంట్, సతీష్ దండే, దయాకర్, ముత్యపాగ విజయ్, సుబ్బారావు, నవీన్, వీరేశం, సాయినాథ్, నరేష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ రజాక్, సతీష్, బోధ శీను, గంగారం, జమిల్ పాషా, వెంకటేష్ లకు నియామక పత్రాలు అందజేశారు.