అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించిన కార్యకర్తకు అండగా నిలిచారు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని ఎస్.సి.కాలనీ కి చెందిన నద్దునూరి నర్సయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.
వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారంతా చిన్నపిల్లలు ఉండడంతో వారి కుటుంబానికి అండగా ఉండాలని పస్రా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు వారి కుటుంబాన్నీ ఓదార్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎల్లవేళలా మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే సీతక్క అండగా ఉంటారని, తాము కూడా ఏ ఆపద వచ్చిన ఆదుకుంటామని వారికి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, పస్రా గ్రామ అధ్యక్షులు, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు పంగ శ్రీను, గ్రామ యూత్ అధ్యక్షుడు కొల్లు శ్రీనివాస్ రెడ్డి, తిక్క దుర్గారావు, దేపాక రాము, పత్రి మధు, నీలాల మల్లేష్, మునిగాల సాంబయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.