కాంగ్రెస్ పార్టీ నిరుపేదల అభ్యున్నతి కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం క్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోలన్ హన్మంత్ రెడ్డి అద్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ర్యాలీగా 5౦౦ మంది వివిధ పార్టీల నుండి భారీ సంఖ్యలో టీపిపిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
127డివిజన్ మాజీ బిజెపి డివిజన్ అధ్యక్షులు పెరిక శివ,129 డివిజన్ మొండి సాయి కృష్ణ సేవాదళం అధ్యక్షులు మొండి సాయి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ వాసులు రాష్ట్ర గిరిజన సంగం మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్నా లాల్ సింగ్ నాయక్, నిజాంపేట్ రాజీవ్ గృహ కల్ప మదర్ థెరిస్సా సేవ సంగం అధ్యక్షురాలు రాధా తెరాస పార్టీ 129డివిజన్ మహిళా అధ్యక్షురాలు షహనాజ్ బేగం వారి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన నాయకులు,(ఐఎన్టియుసి) నాయకులు,(ఎన్ఎస్యుఐ)నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి