31.7 C
Hyderabad
May 2, 2024 08: 05 AM
Slider హైదరాబాద్

కమలానికి, కారు పార్టీకీ ఏకకాలంలో షాక్ ఇచ్చిన కాంగ్రెస్

#lingojiguda

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి లైఫ్ లేదని ఎవరన్నారు? రండి ఒక్క సారి హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడా డివిజన్ ఉప ఎన్నిక ఫలితాన్ని చూడండి. కాంగ్రెస్ పార్టీ ఎలా ఢంకా బజాయించి గెలిచిందో తెలుస్తుంది. అధికార టీఆర్ఎస్ కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. సానుభూతి పవనాలను కూడా కాదని కాంగ్రెస్ అభ్యర్ధి విజయం దక్కించుకున్నారు. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు జరిగిన సాధారణ ఎన్నికల్లో లింగోజీ గూడా నుంచి బిజెపి అభ్యర్ధి ఆకుల రమేష్ గౌడ్ గెలుపొందారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. దాంతో లింగోజీగూడాలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి నాయకులు వెళ్లి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తమ అభ్యర్ధి ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించాడని అందువల్ల బిజెపి అభ్యర్ధికి పోటీ నిలబెట్టవద్దని కోరారు. దాంతో ఆయన అంగీకరించి బిజెపి అభ్యర్ధిగా ప్రకటించిన అఖిల్ గౌడ్ ను ఆశీర్వదించి పంపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పోటీకి నిలబడ్డారు. ఆయనతో బాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉండటంతో పోలింగ్ అనివార్యం అయింది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. అయితే ఈ ఉప ఎన్నికలో ఆయన విజేతగా నిలిచారు. అందరిని ఈ ఫలితం ఆశ్చర్య పరిచింది. బిజెపి ఒక్క సారిగా నిర్ఘాంత పోయింది. ఈ ఫలితంలో జీహెచ్ఎంసిలో కాంగ్రెస్ బలం మూడుకు పెరిగింది.

Related posts

మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ఓ తారక రామా ఓ సారి ఇటు రావా

Satyam NEWS

గోపాలపురంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ

Satyam NEWS

Leave a Comment