ఛత్తీస్గఢ్లోని రాయ్ పూర్లో ఫిబ్రవరి రెండో వారంలో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనుంది. అలాగే భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ నిర్వహించాలని నిర్ణయించింది. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన తరువాత మొదటి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిచారు. అందులో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సోనియా గాంధీ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
previous post
next post