33.7 C
Hyderabad
April 28, 2024 00: 35 AM
Slider నల్గొండ

రైతు సంక్షేమంలో విఫలమైన టీఆర్ఎస్ ప్రభుత్వం

#Congress Party Huzurnagar

కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  ఇందిరా భవన్ లో దీక్ష నిర్వహించారు.

కరోనా కాలంలో అన్ని వర్గాల రైతులకు సదుపాయాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం  విఫలమైందని వారు ఆరోపించారు. ఈ రైతు సంక్షేమ దీక్షలో ఐఎన్ టి యుసి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ యర్రగాని నాగన్న గౌడ్, హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ కస్తాల శ్రావణ్ కుమార్, 6వ,వార్డు కౌన్సిలర్ ములకలపల్లి రామ్ గోపి, 7వ వార్డు కౌన్సిలర్ వేముల వరలక్ష్మి నాగరాజు పాల్గొన్నారు.

ఇంకా 14వ వార్డు కౌన్సిలర్ తేజావత్ రాజా, 9వ వార్డ్ కౌన్సిలర్  బోల్లేదు ధనమ్మ, 12వ వార్డు కౌన్సిలర్ వెలిదండ సరిత వీరారెడ్డి, 16 వ వార్డు కౌన్సిలర్ కారంగుల విజయ వెంకటేశ్వర్లు, ఐఎన్ టి యుసి హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

(Official) How Long Does It Take For Black Rhino Male Enhancement Pill To Take Effect Stp Male Enhancement

Bhavani

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందచేసిన ఆర్య వైశ్య సంఘం

Satyam NEWS

మారిన వాతావరణం.. ఎండకు బదులు వాన..ఎక్కడంటే…?

Satyam NEWS

Leave a Comment