మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు జరిగిన కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ సంకల్ప దీక్షకార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంపత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి కక్షపూరితంగా పాత కేసులో చిన్న మాట చెప్పినందుకు రెండేళ్లు జైలు శిక్ష విధించడం అనేది ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
దీనికి హద్దులుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అయిన బిజెపి ఆదానిని కాపాడాలని ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఆదాని మీద ఎక్కువ మాట్లాడుతాడు ఉద్దేశంతో అతని ఎంపీ పదవికి అర్హత వేటు వేయడం చాలా ఆలోచించే విషయం ఇది ప్రజాస్వామ్యం బతుకుతుందా ఈ బిజెపి పరిపాలనలో, మానవత్వం కొంచమైనా కనబడుతుందా ఈ బీజేపీ పరిపాలనలో కొంచెం ఆలోచించండి ప్రజలారా సరైన సమయంలో బిజెపిని బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒబెదుల్ల కొత్వాల్ మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ PCC ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ప్రదీప్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.