తెలంగాణలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్ల పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలను వారు పనిచేస్తున్న కొత్త జిల్లా పరిషత్లకు బదలాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని ఆయా జిల్లా పరిషత్ల సీఈవోలను ఆదేశించింది. తెలంగాణలో 2016లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అయినా పాలనపరమైన కారణాల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాలు పాత పద్ధతి ప్రకారమే 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో కొనసాగాయి. తాజాగా సమీకృత జిల్లా కలెక్టరేట్ల భవనాలు అందుబాటులోకి వచ్చి పాలన గాడినపడిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాతాలను వారు పనిచేస్తున్న జిల్లాలకు బదలాయించాలని ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది.
previous post