33.7 C
Hyderabad
April 29, 2024 02: 52 AM
Slider ముఖ్యంశాలు

రామ‌చంద్ర మిష‌న్ నూత‌న కేంద్రం ప్రారంభం

president

రాష్ట్ర‌ప‌తి ‌రామ్‌నాథ్ కోవింద్‌ రంగారెడ్డి జిల్లాలో రామ‌కృష్ణ‌మిష‌న్ నూత‌న‌ అంత‌ర్జాతీయ కేంద్ర కార్యాల‌యం క‌న్హ శాంతి వ‌నం ను నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళ‌న‌లు, అనిశ్చితి, అభ‌ద్ర‌త‌, శ‌త్రుత్వాల‌తో నిండిన ప్ర‌పంచంలో శ్రీ‌రామచంద్ర‌మిష‌న్ వంటి సంస్థ‌ల బాధ్య‌త ఎన్నోరెట్లు పెరిగింద‌ని అన్నారు. ఇలాంటి సంస్థలు ఉప‌శ‌మ‌నానికి త‌గిన భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌వని ఆయ‌న అన్నారు.

మాన‌వాళి దిశ‌ను మార్చ‌డానికి మ‌నం మెరుగైన ప్ర‌పంచం నిర్మించే దిశ‌గా ఎంతో ఎక్కువ‌ మంది యువ‌త‌ను మ‌ళ్లించి, వారిని ఈ కృషిలో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని రాష్ట్ర‌ప‌తి పిలుపునిచ్చారు. శ్రీ‌రామ‌చంద్ర మిష‌న్ కు చెందిన అంత‌ర్జాతీయ స‌మాజం ఈ భూమండ‌లాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్ద‌గ‌ల‌ద‌న్న ఆకాంక్ష‌ను రాష్ట్ర‌ప‌తి వ్య‌క్తం చేశారు. అలాగే, మెరుగైన స‌మాజంగా, సంతోషం, సంపూర్ణ సానుకూల శ‌క్తియుక్తుల‌తో అల‌రారే దిశ‌గా మాన‌వాళిని ప‌రివ‌ర్త‌న చెందించ‌గ‌ల‌ద‌న్న ఆకాంక్ష‌ను రాష్ట్ర‌ప‌తి వ్య‌క్తం చేశారు.

Related posts

ఏప్రిల్ 2 న తెలుగులో వస్తున్న “లెగసి ఆఫ్ లైస్”

Satyam NEWS

హుజురాబాద్ టీఆరెస్ పార్టీ కార్యాలయ ఆధునీకరణ

Satyam NEWS

రామన్నపేట, నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి పెంపు

Satyam NEWS

Leave a Comment