39.2 C
Hyderabad
May 3, 2024 14: 26 PM
Slider ప్రత్యేకం

జగన్ కోర్టు ధిక్కారం పిల్ పై 16న సుప్రీం విచారణ

#Y S Jagan mohan reddy

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జిలపైనా పలు ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖకు బహిర్గతం చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తున్నది.

సుప్రీంకోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరితో బాటు యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కూడా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్లపై ఈనెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Related posts

కరోనా పీడితులకు ఆహారం అందిస్తున్న మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS

పోలింగ్ కేంద్రాల వ‌ద్ద మీడియాతో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌కండి

Satyam NEWS

కేంద్రం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment