ఎలాంటి నోటీసు ఇవ్వకుండా గుడి కూలగొట్టవచ్చా? మొత్తం గుడి కాకపోయినా కొంచె కూలగొడతాం అంటే భక్తులు ఊరుకుంటారా? భక్తులు ఊరు కోరు. అందుకే పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం లో ఎవరూ లేని సమయంలో అధికారులు వచ్చి అక్కడ ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కూలగొట్టాలని అధికారులు ప్రయత్నించారు.
ముందు నోటీసు ఇవ్వకుండా గుడికి సంబంధించిన భక్తులు ఎవరు లేని టైం చూసి మిట్టమధ్యాహ్నం రోడ్డు వైండింగ్ పేరుతో గుడి కొట్టటానికి టౌన్ ప్లానింగ్ సూపర్ వైజెర్ రాఘవరావు వచ్చాడు.
నోటీసుతో పని లేదు… ఇష్టారాజ్యంగా మా ఇష్టం వచ్చింది చేస్తామని మునిసిపల్ అధికారులు అంటున్నారు. దీంతో మనస్తాపం కు గురై గుడి ధర్మ కర్త కొడుకు వంశీకృష్ణ జె సి బి కి అడ్డంగా పడుకున్నాడు. మా స్థలం లో గుడి ఉంది… రోడ్డు కొలతలు తో రండి అని అతను అడుగుతున్నాఅధికారులు పట్టించుకోవడం లేదు.
మాదిరాజు రామ్మూర్తి, సత్యంన్యూస్.నెట్