2021-22 ఏడాదికి పార్టీల వార్షిక ఆడిట్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం లెక్కలు తేల్చింది. అత్యధికంగా ప్రకటనలు, ప్రచారానికి రూ.313.17 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ ప్రధమ స్థానంలో వుండగా , టీడీపీ రూ.1.66 కోట్లు, బీఆర్ఎస్ రూ.7.12 కోట్లు, సమాజ్వాదీ రూ.7.56 కోట్లు ఖర్చు, టీఎంసీ రూ.28.95 కోట్లు, బీఎస్పీ రూ.13.83 కోట్లు ఖర్చు, ఆప్ రూ.30.29 కోట్లు, అన్నాడీఎంకే రూ.28.43 కోట్లు ఖర్చు, డీఎంకే రూ.35.40 కోట్లు, బీజేడీ రూ.16 కోట్లు ఖర్చు, జేడీయూ రూ.36.82 లక్షలు, కాగా ప్రకటనల కోసం వైసీపీ, సీపీఐ ఎలాంటి ఖర్చు చేయలేదని ఈసీ వెల్లడిoచింది. ఇదిలా వుండగా పార్టీ పరంగా వైసిపి ఎలాంటి ఖర్చు చేయలేదు . కాని ప్రభుత్వ పరంగా వైసీపీ సర్కార్ వందల కోట్లు వెచ్చించిoది. ర్టీ ఖర్చు పెట్టకుండా వైసీపీ ప్రభుత్వ డబ్బులు వెచ్చించిందని ప్రతిపక్షాల విమర్శిస్తున్నాయి. ఈసీకి వివరాలు అందించని పార్టీల జాబితాలో కాంగ్రెస్, సీపీఎం వున్నాయి.